లారీని ఢీకొని బొలేరా వాహనం బోల్తా..వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-07-18T12:02:37+05:30 IST
గుత్తి మండలంలోని కొత్తపేట గ్రామ శివారు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున లారీని ఢీకొని బొలేరా వాహనం డ్రైవర్ సయ్యద్ సాహెబ్ (27) మృతి చెందాడు. క ర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గకు చెందిన
అనంతపురం: గుత్తి మండలంలోని కొత్తపేట గ్రామ శివారు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున లారీని ఢీకొని బొలేరా వాహనం డ్రైవర్ సయ్యద్ సాహెబ్ (27) మృతి చెందాడు. క ర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గకు చెందిన బొలేరా వాహనం అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తూ ముందు వెళ్తున్న టమోటా లోడ్తో వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో సయ్యద్ సాహెబ్ అక్కడిక్కడే మృతి చెందాడు. సీఐ రాము, ఎస్ఐ సుధాకర్ యాదవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి త రలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.