AP: పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-08-23T14:36:25+05:30 IST
జిల్లాలోని కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు.
అనంతపురం: జిల్లాలోని కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈనెల 27న మహేష్కు వివాహం నిశ్చయమైంది. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. మహేష్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.