క్రైమ్ రేట్‌ను మరింత తగ్గిస్తాం: అనంత SP

ABN , First Publish Date - 2021-12-29T18:12:26+05:30 IST

జిల్లాలోని క్రైం రౌండప్ - 2021పై ఎస్పీ పకీరప్ప బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.

క్రైమ్ రేట్‌ను మరింత తగ్గిస్తాం: అనంత SP

అనంతపురం: జిల్లాలోని క్రైం రౌండప్ - 2021పై ఎస్పీ పకీరప్ప బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలీసులు సమర్థవంతంగా సేవలందిస్తున్నారని... క్రైమ్ రేట్‌ను మరింత తగ్గిస్తామని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. టెక్నాలజితో నేరాలను కట్టడి చేస్తున్నామని, సాంకేతికతతో పోలీసింగ్‌ను మరింత పటిష్టం చేసినట్లు తెలిపరాు. కరోనా విపత్తులో పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా సేవలు అందించారని... తుపాను, వరదల సమాయాల్లో  పోలీసులు విశిష్టంగా విధులు నిర్వహించారని కొనియాడారు. ఎర్ర చందనం అక్రమ రవాణా,  క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపామన్నారు. నూతన సంవత్సర వేడుకలపై గట్టి పోలీసు నిఘా ఉందన్నారు. డ్రంకెన్ డ్రైవ్ ఉధృతం చేస్తామని చెప్పారు. బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు డిసెంబర్ 31 రాత్రి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సమయం వరకే ఉండాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ పకీరప్ప హెచ్చరించారు. 

Updated Date - 2021-12-29T18:12:26+05:30 IST