అనంతలో విద్యార్థులతో Lokesh ముఖాముఖి
ABN , First Publish Date - 2021-11-10T19:30:49+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లా పర్యటన కొనసాగుతోంది.
అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా పోలీసుల లాఠీచార్జ్లో గాయపడ్డ వారిని లోకేష్ పరామర్శించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ దగ్గర ఎస్ఎస్బీఎన్ విద్యార్థులు ఆవేదనను వ్యక్తం చేశారు. ‘‘మేం ఏం చేశాం.. మేమేమన్న గంజాయి అమ్ముతున్నామా?’’ అని ప్రశ్నించారు. తల్లిదండ్రులు జగన్కు ఎందుకు ఓటేశారని విద్యార్థులు ప్రశ్నించారు. అమ్మఒడి కాదు.. విద్యాసంస్థల ఆస్తులను కాజేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేత రామకృష్ణ పాల్గొన్నారు.