అనంతపురం జిల్లా: పెనుగొండ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు

ABN , First Publish Date - 2021-11-14T15:00:37+05:30 IST

పెనుకొండ కోటలో పాగా వేసేందుకు అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు.

అనంతపురం జిల్లా: పెనుగొండ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు

అనంతపురం జిల్లా: పెనుకొండ కోటలో పాగా వేసేందుకు అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. అధికార దర్పంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్‌గానే పంపకాలు చేపడుతున్నారు. ప్రతి ఇంటికి  వెయ్యి రూపాయలు, చీర, జాకెట్ బ్యాగ్‌లతో పంపిణి చేస్తున్నారు. పెనుకొండ నగర పంచాయతీని కైవసం చేసుకునేందుకు వైసీపీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయానికి ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో అక్కడ స్థానికేతరులు ఎవరూ ఉండకూడదు. అయితే రాయదుర్గం నియోజక వర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి పెనుగొండ పట్టణంలోని 18వ వార్డులో హల్ చల్ చేశారు. తన అనుచరులను వెంటపెట్టుకుని నగదు, మద్యంతోపాటు చీరల పంపిణీ చేశారు. పోలీసులు, అధికారుల సమక్షంలోనే పంపిణీ చేస్తున్నారు.  దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక మీడియాతోపాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కూడా వెళ్లారు. దీనిపై ఏబీఎన్ రిపోర్టర్  వీడియో, ఫోటోలు తీశారు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది, వైసీపీ నేతలు ఏబీఎన్ రిపోర్టర్ నుంచి సెల్ ఫోన్ తీసుకుని బెదిరించారు. సెల్ ఫోన్‌లో వీడియో, ఫోటోలను తీసివేశారు. 

Updated Date - 2021-11-14T15:00:37+05:30 IST