అనంతపురంలో మంత్రి బొత్సకు నిరసన సెగ
ABN , First Publish Date - 2021-11-28T00:26:14+05:30 IST
మంత్రి బొత్సకు నిరసన సెగ తగిలింది. సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి కాన్వాయ్ను విద్యార్థులు అడ్డుకున్నారు. కలెక్టరేట్కు ..
అనంతపురం: మంత్రి బొత్సకు నిరసన సెగ తగిలింది. సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి కాన్వాయ్ను విద్యార్థులు అడ్డుకున్నారు. కలెక్టరేట్కు జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి బొత్స హాజరయ్యారు. సమావేశం ముగించుకుని వెళ్తున్న సమయంలో మంత్రి కారుకు అడ్డంగా విద్యార్థి సంఘాల నేతలు బైఠాయించారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.