టోల్ప్లాజా, సిబ్బందిపై వైసీపీ నేత అమర్నాథ్ రెడ్డి దాడి
ABN , First Publish Date - 2022-01-06T21:24:04+05:30 IST
అనంతపురం జిల్లాలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయారు. తన అనుచరులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారా..అంటూ..
అనంతపురం: జిల్లాలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయారు. తన అనుచరులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారా.. అంటూ అమర్నాథ్ రెడ్డి టోల్ప్లాజాపై దాడి చేశారు. అడ్డుకోబోయిన ఉద్యోగులపై కూడా దాడి చేశారు. టోల్ప్లాజా ప్రాంగణంలో అమర్నాథ్ రెడ్డి భయానక వాతావరణం సృష్టించారు. టోల్ ప్లాజా ప్రారంభం నుంచి పనిచేస్తున్నతన అనుచరులను తొలగించి వేరేవారిని ఎలా నియమిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా నియమించిన ముగ్గురు వ్యక్తులు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే అనుచరులు కావడంతో గొడవ మరింత ముదిరింది. అయితే టోల్ ప్లాజాపై దాడి విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. వివాదంపై కదిరి, పుట్టపర్తి ప్రజా ప్రతినిధులు పంచాయతీ చేస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులకు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.