కుమారుడి మృతదేహాన్ని చేతులపై మోసుకెళ్లి ఖననం చేసిన తండ్రి

ABN , First Publish Date - 2020-03-28T14:47:03+05:30 IST

అనంతపురం: అనారోగ్యంతో కుమారుడు చనిపోతే చేతులపై మోసుకెళ్లి ఓ తండ్రి ఖననం చేయాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది.

కుమారుడి మృతదేహాన్ని చేతులపై మోసుకెళ్లి ఖననం చేసిన తండ్రి

అనంతపురం: అనారోగ్యంతో కుమారుడు చనిపోతే చేతులపై మోసుకెళ్లి ఓ తండ్రి ఖననం చేయాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. కదిరిలోని ఓ కుటుంబం చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో కన్నకొడుకు అనారోగ్యం పాలయ్యాడు. హిందూపూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కుమారుడు మృతి చెందాడు. కన్నకొడుకు మృతి ఓ వైపు కృంగదీస్తుంటే అంత్యక్రియలకు కూడా డబ్బులేక ఆ తల్లిదండ్రులు అల్లాడిపోయారు. కరోనా కారణంగా సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కుమారుడి మృతదేహాన్ని కన్నతండ్రి చేతులపై మోసుకెళ్లి ఖననం చేశాడు. 


Updated Date - 2020-03-28T14:47:03+05:30 IST