చెక్కుచెదరని నీమ్రానా కోట!
ABN , First Publish Date - 2020-10-05T05:30:00+05:30 IST
పదిహేనో శతాబ్దంలో నిర్మించిన కోట ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అరావళి పర్వతాలపై నిర్మించిన ఈ కోట ప్రస్తుతం లగ్జరీ హోటల్గా సేవలు అందిస్తోంది. రాజస్థాన్లో ఉన్న పురాతన నీమ్రానా కోట విశేషాలు ఇవి...
పదిహేనో శతాబ్దంలో నిర్మించిన కోట ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అరావళి పర్వతాలపై నిర్మించిన ఈ కోట ప్రస్తుతం లగ్జరీ హోటల్గా సేవలు అందిస్తోంది. రాజస్థాన్లో ఉన్న పురాతన నీమ్రానా కోట విశేషాలు ఇవి... .
- 1464లో రాజ్పుత్ మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ - 3 ఈ కోటను నిర్మించారు. ఆ కాలంలో ఇది మూడో రాజధానిగా గుర్తింపు పొందింది. ఢిల్లీ, జైపూర్ జాతీయ రహదారిపై ఉంటుంది.
- కొండపై 25 ఎకరాల విస్తీర్ణంలో 11 అంతస్థుల్లో నిర్మించిన ఈ కోట పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. రాత్రి వేళల్లో మిరుమిట్లుగొలిపే దీపాల కాంతులతో కోట మెరిసిపోతూ ఉంటుంది.
- మనదేశంలో ఉన్న పురాతన వారసత్వ రిసార్టులలో ఇదొకటి. రెండు స్విమ్మింగ్పూల్స్, వేలాడే తోటలు, కోటపై నుంచి కనిపించే ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి.
- వారాంతంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను అలరిస్తాయి. అడ్వెంచర్ కోరుకునే వారి కోసం ‘జిప్ టూర్’ అందుబాటులో ఉంది.