కొవిడ్తో ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ మృతి
ABN , First Publish Date - 2021-05-09T08:44:53+05:30 IST
కరోనా బారిన పడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ సరాకుల మోహనరావు(43) మరణించారు
కాకినాడ, మే 8(ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ సరాకుల మోహనరావు(43) మరణించారు. కాకినాడ జీజీహెచ్లో మూడురోజులుగా చికిత్స పొందుతున్న ఆయనకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో ఐసీయూలోకి తరలించి చికిత్స అందించారు. శ్వాస అందక శనివారం మధ్యాహ్నం ఆయన మరణించారు. 2005లో ‘ఆంధ్రజ్యోతి’లో కంట్రిబ్యూటర్గా చేరిన ఆయన 2009లో ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూల్లో శిక్షణ పొంది, అప్పటి నుంచి కాకినాడలో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మోహనరావు మృతిపట్ల తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రజ్యోతి ఉద్యోగులు, పలు జర్నలిస్టు సంఘాలు సంతాపం ప్రకటించాయి.