ఆంధ్రా పేపర్ లాభం రూ.32 కోట్లు
ABN , First Publish Date - 2021-05-12T06:16:20+05:30 IST
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఆంధ్రా పేపర్ రూ.32.34 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.92.92 కోట్లతో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఆంధ్రా పేపర్ రూ.32.34 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.92.92 కోట్లతో పోలిస్తే 65 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం రూ.284.24 కోట్ల నుంచి రూ.366.66 కోట్లకు చేరింది. మొత్తం ఏడాదికి రూ.902 కోట్ల ఆదాయంపై రూ.4.59 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు కంపెనీ వెల్లడించింది.