ఏపీకి అమరరాజా బ్యాటరీస్ గుడ్ బై?

ABN , First Publish Date - 2021-08-03T02:52:23+05:30 IST

ఏపీకి అమరరాజా బ్యాటరీస్ గుడ్ బై?

ఏపీకి అమరరాజా బ్యాటరీస్ గుడ్ బై?

అమరావతి: ఏపీకి అమరరాజా బ్యాటరీస్ గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. చెన్నైకు తరలిపోనున్నట్లు సమాచారం. సీఎం స్టాలిన్‌తో అమరరాజా యాజమాన్యం చర్చలు జరిపింది. అమరరాజాకు సీఎం స్టాలిన్ రెడ్ కార్పెట్ పర్చారు. ఇప్పటికే స్థలం కేటాయించినట్లు తెలుస్తోంది. కేటాయించిన స్థలంలో ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. 3 నెలల్లో చిత్తూరు నుంచి తమిళనాడుకి అమరరాజా తరలివెళ్లనున్నట్లు సమాచారం. బ్యాటరీ సెక్టార్‌లో దేశంలోనే అమరరాజా 2వ అతిపెద్ద సంస్థగా ఉంది. 1 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగి ఉంది. పన్నుల రూపంలో అమరరాజా కంపెనీ ప్రతి సంవత్సరం రూ.2400 కోట్లు చెల్లిస్తోంది. అమరరాజా చెల్లించే పన్నులలో ఏపీ వాటా రూ.1200 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తోంది. జన్మభూమిలో ఉపాధి మార్గాలు పెంచాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లాలో అమరరాజా ప్రారంభమైంది. 

Updated Date - 2021-08-03T02:52:23+05:30 IST