APలో ఆ శాఖలు యథాతథం.. G.O జారీ చేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-07-20T00:10:07+05:30 IST

APలో ఆ శాఖలు యథాతథం.. G.O జారీ చేసిన ప్రభుత్వం

APలో ఆ శాఖలు యథాతథం.. G.O జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి: వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖలు యదాతధంగా కొనసాగనున్నాయి. వారం క్రితం ఈ రెండు శాఖలను ఆర్ధిక శాఖ కిందకు చేరుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లో కథనాలు ప్రసారమయ్యాయి. ఈ జీవో‌ని ప్రభుత్వం సోమవారం అభయన్స్‌లో పెట్టింది. రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులశాఖను రెవిన్యూ పరిధిలోనే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియకుండా ఈ జీవో జారీ చేశారని అప్పట్లో ప్రచారం జారీ చేసింది. ఈ వివాదంపై దృష్టి సారించిన సీఎం జగన్ మళ్లీ జీవోను అభయన్స్‌లో పెడుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-07-20T00:10:07+05:30 IST