AP: సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-12-27T16:35:00+05:30 IST
సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
అమరావతి: సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణ మండపంలో మహాసభలు జరుగుతున్నాయి. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ పతాకాన్ని ఎగురవేసి మహాసభలను మొదలుపెట్టారు. సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్, బీవీ రాఘవులు ఈ సభలకు హాజరయ్యారు.