ఏపీలో నేటికి కూడా జీతాలు, పెన్షన్లు నిల్

ABN , First Publish Date - 2021-08-03T02:28:22+05:30 IST

ఏపీలో నేటికి కూడా జీతాలు, పెన్షన్లు నిల్

ఏపీలో నేటికి కూడా జీతాలు, పెన్షన్లు నిల్

అమరావతి: 2వ తేదీ సాయంత్రానికి కూడా జీతాలు, పెన్షన్లు పడలేదు. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్ల రూపేణా రూ.5,500 కోట్లు కావాల్సి ఉంది. నిన్న ఆదివారం కావడంతో సోమవారం పడతాయని పెన్షనర్లు, ఉద్యోగులు భావించారు. ఈ సాయంత్రానికి కూడా వారి ఖాతాల్లో జీతాలు జమకాలేదు. నిధులు లేకపోవటంతో వనరుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం, ఓవర్ డ్రాఫ్ట్, వేస్ అండ్ మీన్స్ ద్వారా తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 


Updated Date - 2021-08-03T02:28:22+05:30 IST