మద్యం అమ్మకాల పెంపునకు ఏపీ ప్రభుత్వం కొత్త ఎత్తు
ABN , First Publish Date - 2022-01-18T03:09:31+05:30 IST
మద్యం అమ్మకాల పెంపునకు ఏపీ ప్రభుత్వం కొత్త ఎత్తు వేసింది. మద్యం షాపుల్లో అకౌంట్లు క్లోజ్ చేయడానికి అంటూ మరో గంట సమయం పెంచింది. ఇదే కారణంతో ...
అమరావతి: మద్యం అమ్మకాల పెంపునకు ఏపీ ప్రభుత్వం కొత్త ఎత్తు వేసింది. మద్యం షాపుల్లో అకౌంట్లు క్లోజ్ చేయడానికి అంటూ మరో గంట సమయం పెంచింది. ఇదే కారణంతో గతేడాది రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పెంచారు. అదే సాకుతో తాజాగా మరో గంట పెంచుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇకపై రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్ చేసి ఉంటాయి. కరోనా నిబంధనల సాకుతో సమయం పెంచింది. ప్రభుత్వ నిర్ణయంతో మద్యనిషేధ హామీకి మరోసారి తూట్లు పొడిచారు.