ఏపీలో రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు

ABN , First Publish Date - 2021-07-22T22:27:46+05:30 IST

ఏపీలో రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు

ఏపీలో రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు

అమరావతి: ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. కాగా కరోనా కారణంగా ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు అయ్యాయి. ఈ నేపధ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కూడా జరగలేదు. అయితే గ్రేడ్ల విధానంలో వారిని పాస్ చేసి సెకండియర్‌కు పంపారు. ఇప్పుడు ఇదే విధానంలోనే ఇంటర్ విద్యార్థులను కూడా పాస్ చేయనున్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-07-22T22:27:46+05:30 IST