‘15వ తేదీని ప్రకటించడం బాధాకరం’

ABN , First Publish Date - 2022-01-11T21:44:07+05:30 IST

భారతదేశంలో 27 రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 14 వ తేదీన మకర సంక్రాంతిగా ప్రకటించారు కానీ రెండు తెలుగు రాష్ట్రాలు 15వ తేదీని ప్రకటించడం బాధాకరమని భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ కర్తలు...

‘15వ తేదీని ప్రకటించడం బాధాకరం’

విజయవాడ: భారతదేశంలో 27 రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 14 వ తేదీన మకర సంక్రాంతిగా ప్రకటించారు కానీ రెండు తెలుగు రాష్ట్రాలు 15వ తేదీని ప్రకటించడం బాధాకరమని  భారత ప్రభుత్వ ఆమోదిత  దృగ్గణిత  పంచాంగ కర్తలు పొన్నలూరి శ్రీనివాస్ గార్గేయ అన్నారు. జనవరి 14 మధ్యాహ్నం 2.29 నిమిషాలకు మకర సంక్రమణమని కచ్చితంగా చెబుతున్నాయని, నాసా వారు ప్రత్యక్ష రుజువుకు ప్రధానంగా నిలబడేది దృగ్గణిత పంచాంగమన్నారు. పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేయవలసినది 14 తేదీ మాత్రమేనని, భారత ప్రభుత్వాలు తమ నిర్ణయం మార్చుకుని 14వ తేదీని మకర సంక్రాంతిగా ప్రకటించాలని సూచించారు. పూర్వ గణిత పంచాంగ కర్తలకు దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పదవులను ఇచ్చి పంచాంగలను మార్చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

 

Updated Date - 2022-01-11T21:44:07+05:30 IST