కలకలంగా మారిన హత్యాయత్నం వీడియో
ABN , First Publish Date - 2022-01-03T22:34:40+05:30 IST
జిల్లాలోని అల్లవరం మండలం తుమ్మలపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. కొటికలపూడి రంగారావుపై మేనల్లుడు గుర్రం రాజీవ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తూర్పుగోదావరి: జిల్లాలోని అల్లవరం మండలం తుమ్మలపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. కొటికలపూడి రంగారావుపై మేనల్లుడు గుర్రం రాజీవ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రంగారావు పీక మీద కూర్చుని ఊపిరి ఆపి చంపేందుకు యత్నించాడు. మేనమామ భార్య కేకలు వేయడంతో స్థానికులు కాపాడారు. రంగారావు తన తలపై కొట్టాడంటూ మేనల్లుడు రాజీవ్ ఆరోపించారు. దాంతో హత్యాయత్నం వీడియో కలకలంగా మారింది. కొటికలపూడి రంగారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.