AP: రివర్స్‌ పీఆర్సీసీపై దండెత్తిన సచివాలయ ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-18T19:10:06+05:30 IST

జగన్ సర్కార్‌పై రివర్స్ పీఆర్సీ విషయంలో సచివాలయ ఉద్యోగులు దండెత్తారు.

AP: రివర్స్‌ పీఆర్సీసీపై దండెత్తిన సచివాలయ ఉద్యోగులు

అమరావతి: జగన్ సర్కార్‌పై రివర్స్ పీఆర్సీ  విషయంలో సచివాలయ ఉద్యోగులు దండెత్తారు. రివర్స్ పీఆర్సీపై సచివాలయ ఉద్యోగుల సంఘ నేతలను ఉద్యోగులు నిలదీశారు. ఈ క్రమంలో ఉద్యోగులతో కలసి ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి సీఎస్‌కు రిప్రసెంటేషన్ ఇచ్చేందుకు వెళ్లారు. రివర్స్ పీఆర్సీపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వందలాది మంది ఉద్యోగులు ర్యాలీగా సీఎస్ ఆఫీస్ వైపు కదిలారు. కాగా... ఒకటవ బ్లాక్ వద్ద ఉద్యోగులను భద్రతా సిబ్బంది అడ్డగించారు. కొంతమంది ఉద్యోగులను మాత్రమే సిబ్బంది లోనికి అనుమతించారు. 

Updated Date - 2022-01-18T19:10:06+05:30 IST