అంగన్‌వాడీ హెల్పర్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-17T05:41:36+05:30 IST

మండలంలోని క్రిష్ణారావుపేట గ్రామంలో అంగన్‌వాడీ హెల్పర్‌గా పనిచేస్తున్న పార్వతమ్మ (54) ఆదివారం మృతి చెం దారు.

అంగన్‌వాడీ హెల్పర్‌ మృతి

పాములపాడు మే 16: మండలంలోని క్రిష్ణారావుపేట గ్రామంలో అంగన్‌వాడీ హెల్పర్‌గా పనిచేస్తున్న పార్వతమ్మ (54) ఆదివారం మృతి చెం దారు. ఆమె  పదిహేను రోజులు క్రితం కరోనా టీకా వేయించుకొందన్నారు. ఆనాటి నుంచి తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను జిల్లా సీఐటీయూ నాయకులు భాస్కర్‌ రెడ్డి, అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యదర్శి శివలక్ష్మి, సరస్వతి, స్వర్ణకుమారి  కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలు కుటుంబ సభ్యులకు 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా, అంగన్‌వాడీ  హెల్పర్‌ ఉద్యోగం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-05-17T05:41:36+05:30 IST