ఎంజీ మోటార్‌ ‘గ్లోస్టర్‌’

ABN , First Publish Date - 2020-09-25T06:13:35+05:30 IST

ఎంజీ మోటార్‌ ఇండియా.. ప్రీమియం ఎస్‌యూవీ ‘గ్లోస్టర్‌’ ను ఆవిష్కరించింది...

ఎంజీ మోటార్‌ ‘గ్లోస్టర్‌’

న్యూఢిల్లీ: ఎంజీ మోటార్‌ ఇండియా.. ప్రీమియం ఎస్‌యూవీ ‘గ్లోస్టర్‌’ ను ఆవిష్కరించింది. అక్టోబరులో ఈ ఎస్‌యూవీని అధికారికంగా విడుదల చేయనుంది. భవిష్యత్‌ ఆటోమొబైల్‌లో కీలకంగా ఉండనున్న కనెక్టడ్‌, అటానమస్‌, షేర్డ్‌, ఎలక్ట్రిక్‌ (కేస్‌) విభాగంలో ఈ ఎస్‌యూవీ కీలకంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. కంపెనీ డీలర్‌షిప్స్‌ లేదా ఆన్‌లైన్‌లో రూ.లక్ష చెల్లించి గ్లోస్టర్‌ను బుక్‌ చేసుకోవచ్చని సంస్థ సీఈఓ రాజీవ్‌ చాబా తెలిపారు. వచ్చే రెండు వారాల్లో గ్లోస్టర్‌ ధరలను అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. 

Updated Date - 2020-09-25T06:13:35+05:30 IST