మురళీధరన్‌కు యాంజియోప్లాస్టీ

ABN , First Publish Date - 2021-04-19T09:30:57+05:30 IST

శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌కు ఆదివారం నగరంలోని ఓ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ నిర్వహించారు.

మురళీధరన్‌కు యాంజియోప్లాస్టీ

చెన్నై: శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌కు ఆదివారం నగరంలోని ఓ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ నిర్వహించారు. 49 ఏళ్ల మురళీధరన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచింగ్‌ బృందంలో సభ్యుడు. గత నెలాఖరులో సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఆసుపత్రికి వెళ్లినప్పుడు ధమనిలో పూడిక ఉండడంతో యాంజియోప్లాస్టీ నిర్వహించాలని డాక్టర్లు సూచించారు. దాంతో ముందుగా అనుకున్న విధంగా అతడికి యాంజియో జరిగింది. సోమవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి మురళీధరన్‌ డిశ్చార్జ్‌ అయ్యే అవకాశముంది. 

Updated Date - 2021-04-19T09:30:57+05:30 IST