సీపీఎం సానుభూతిపరుడు అనిల్ కన్నుమూత
ABN , First Publish Date - 2021-04-21T06:13:57+05:30 IST
సీపీఎం సానుభూతిపరుడు అనిల్ కన్నుమూత
భవానీపురం, ఏప్రిల్ 20: విద్యాధరపురం చెరువు సెంటర్కు చెందిన దివంగత డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి కుండనాల భాస్కరరావు తనయుడు కుండనాల అనిల్ వంశీ(43) అనారోగ్యంతో బుధవారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. సీపీఎం సానుభూతిపరుడిగా, అల్లూరి సీతారారామరాజు గ్రంఽథాలయ కార్యదర్శిగా అనిల్ సేవలందిస్తున్నారు. అనిల్ భౌతిక కాయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు, వి.ఉమామహేశ్వరరావు, 50వ డివిజన్ కార్పొరేటర్ బోయి సత్యబాబు, సీపీఎం నాయకులు ఎల్.మోహన్రావు, ఎస్.సుబ్బారెడ్డి, హరిప్రసాద్, అప్పలరాజు సందర్శించి నివాళులర్పించారు.