ఆనైమలై, ముదుమలైకు అంతర్జాతీయ హోదా
ABN , First Publish Date - 2021-08-01T14:34:39+05:30 IST
కోయం బత్తూర్ జిల్లా ఆనైమలై, నీలగిరి ముదుమలై పులుల శరణాల యాలకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ జాతీయ పులుల సంరక్షణ కమిషన్ అంగీకార సర్టిఫికెట్
ఐసిఎఫ్(చెన్నై): కోయంబత్తూర్ జిల్లా ఆనైమలై, నీలగిరి ముదుమలై పులుల శరణాల యాలకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ జాతీయ పులుల సంరక్షణ కమిషన్ అంగీకార సర్టిఫికెట్ అందజేసింది. దేశంలో 20 రాష్ట్రాల్లో 50 పులుల శరణాలయాలున్నాయి. ఇవి దేశ భూ విస్తీర్ణంలో 2.21 శాతంగా ఉన్నాయు. దేశంలో పులుల సంఖ్య ప్రపంచస్థాయిలో 70 శాతంగా ఉంది. 2020లో ప్రపంచస్థాయిలో పులుల గణన నిర్వహించారు. 20 రాష్ట్రాల్లో ఉన్న 28 పులుల శరణాలయాలు ఎంపిక చేసి జాతీయ పులుల భద్రతా కమిషన్ ఏర్పాటు చేసిన కమిటీలో చేర్చారు. వాటిలో 14 శరణాలయాలకు ప్రత్యేక హోదా కల్పించారు.