తక్కువ వయస్సు వారిలోనే పక్షవాతం : నగర సీపీ అంజనీకుమార్
ABN , First Publish Date - 2020-10-30T10:07:13+05:30 IST
గురువారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ’వరల్డ్ స్ర్టోక్ డే‘ సందర్భంగా బ్రెయిన్ స్ర్టోక్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ..
రెజిమెంటల్బజార్/హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 29 (ఆంధ్రజ్యోతి): గురువారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ’వరల్డ్ స్ర్టోక్ డే‘ సందర్భంగా బ్రెయిన్ స్ర్టోక్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలకు వెళ్ళే భక్తులు మంచి జరుగుతుందని ఎలా విశ్వసిస్తారో అలాంటి వాతావరణం ఆస్పత్రులలో ఉండేలా చూడాలన్నారు.
‘బ్రెయిన్ స్ట్రోక్’తో ఇక భయం లేదని, వెంటనే స్పందిస్తే ముప్పు నుంచి రక్షణ ఉంటుందని యశోద ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్ రావు తెలిపారు. పక్షవాతం వచ్చిన రోగులకు నాలుగన్నర గంటల వ్యవధిలో చికిత్స అందిస్తే చచ్చుపడిపోకుండా కాపాడుకోవచ్చునన్నారు. పక్షవాతం వచ్చిందని కుంగిపోకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యూరాలజిస్ట్ మరియు స్ర్టోక్ స్పెషలిస్టు డాక్టర్ ఆర్.ఎ్స.కోమల్కుమార్, సీనియర్ న్యూరో మరియు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సురేష్ గిరగాని తదితరులు పాల్గొన్నారు.