ఆంజనేయపురం వద్ద హైడ్రామా
ABN , First Publish Date - 2021-06-19T04:56:21+05:30 IST
గ్రామస్థుల అనుభవంలో ఉన్న భూమిని గ్రామస్థులకే విడిచి పెట్టాలంటూ సాక్షాత్తు ఎమ్మెల్యే కాకాణి ఆదేశిస్తున్నా.. అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు.
ఆందోళనకు దిగిన గ్రామస్థులు
తోటపల్లిగూడూరు, జూన్ 18 : గ్రామస్థుల అనుభవంలో ఉన్న భూమిని గ్రామస్థులకే విడిచి పెట్టాలంటూ సాక్షాత్తు ఎమ్మెల్యే కాకాణి ఆదేశిస్తున్నా.. అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం ఈ హైడ్రామా మండలంలోని చింతోపు పంచాయతీ మజరా ఆంజనేయపురం వద్ద జరుగుతోంది. శుక్రవారం అధికారులు గ్రామస్థుల కోసం విడిచిపెట్టిన భూమిలోనే ఇళ్ల స్థలాలు సిద్ధం చేస్తుండడంతో గ్రామస్థులు విస్తుపోయారు. అధికారుల తీరును వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఎమ్మెల్యే గోవర్ధన్రెడ్డి అంగీకరించినా, అధికారులకు ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ అనుభవంలో ఉన్న భూమిని విడిచిపెట్టేది లేదని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. తహసీల్దారు రమాదేవి మాట్లాడుతూ ఎమ్మెల్యే గోవర్ధన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామస్థుల అనుభవంలో ఉన్న భూమిని విడిచిపెట్టినట్టు తెలిపారు.