ఎన్టీఆర్ వర్థంతిని ఘనంగా నిర్వహిస్తాం: ఎల్.రమణ

ABN , First Publish Date - 2021-01-17T17:33:03+05:30 IST

ఎన్టీఆర్ 25వ వర్థంతిని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు.

ఎన్టీఆర్ వర్థంతిని ఘనంగా నిర్వహిస్తాం: ఎల్.రమణ

హైదరాబాద్: ఎన్టీఆర్ 25వ వర్థంతిని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పిస్తారని చెప్పారు. అలాగే రసుల్‌పుర నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీలో బాలకృష్ణ, నందమూరి సుహాసిని పాల్గొంటారని ఎల్.రమణ తెలిపారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు చేపడతామన్నారు. తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ గుర్తింపు తీసుకొచ్చారన్నారు. పేదలను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని ఎల్.రమణ తెలిపారు. 

Updated Date - 2021-01-17T17:33:03+05:30 IST