లంక క్రికెటర్లపై ఏడాది నిషేధం

ABN , First Publish Date - 2021-07-31T08:53:47+05:30 IST

ఇంగ్లండ్‌ పర్యటనలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు శ్రీలంక క్రికెటర్లు కుశాల్‌ మెండిస్‌, నిరోషన్‌ డిక్‌వెల్లా, దనుష్క..

లంక క్రికెటర్లపై ఏడాది నిషేధం

కొలంబో: ఇంగ్లండ్‌ పర్యటనలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు శ్రీలంక క్రికెటర్లు కుశాల్‌ మెండిస్‌, నిరోషన్‌ డిక్‌వెల్లా, దనుష్క గుణతిలకపై ఆ దేశ కికెట్‌ బోర్డు (ఎల్‌ఎ్‌ససీ) ఏడాది నిషేధం విధించింది. ఈ ముగ్గురు సీనియర్లకు తలో రూ. 27 లక్షల జరిమానా కూడా వేసింది. అలాగే వీరిని దేశవాళీ క్రికెట్‌ నుంచి ఆరు నెలలు సస్పెండ్‌ చేశారు. గత నెలలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీ్‌సకు ముందు ఈ ముగ్గురు క్రికెటర్లు డర్హామ్‌ వీధుల్లో తిరుగుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. దాంతో బయోబబుల్‌ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు వీరిని సిరీస్‌ నుంచి తప్పించి స్వదేశానికి పంపారు. 

Updated Date - 2021-07-31T08:53:47+05:30 IST