నేటి నుంచి కుంకుళ్లమ్మ ఆలయ వార్షికోత్సవాలు
ABN , First Publish Date - 2021-06-18T04:41:02+05:30 IST
కుంకుళ్లమ్మ ఆలయ వార్షికోత్సవాలు శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించనున్నట్లు ఈవో సుబ్బారెడ్డి తెలిపారు.
ద్వారకాతిరుమల, జూన్ 17: కుంకుళ్లమ్మ ఆలయ వార్షికోత్సవాలు శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించనున్నట్లు ఈవో సుబ్బారెడ్డి తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా వార్షికోత్సవాలు నిర్వహిస్తా మన్నా రు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 19న హోమాలు, 20న మూల విరాట్ ఉత్సవమూర్తులకు పూజలు జరుగుతాయన్నారు. నిబంధనల మేరకు భక్తులను అనుమతిస్తామన్నారు.