మరో 120 కేసులు..
ABN , First Publish Date - 2020-10-20T09:13:57+05:30 IST
జిల్లాలో మరో 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 54,438కు చేరాయి. వీరిలో వైరస్ నుంచి కోలుకుని 51,814
జిల్లాలో 54,438కు చేరిన మొత్తం కరోనా కేసులు
51,814 మంది డిశ్చార్జ్
చికిత్స పొందుతూ మరో నలుగురి మృతి
విశాఖపట్నం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 54,438కు చేరాయి. వీరిలో వైరస్ నుంచి కోలుకుని 51,814 మంది డిశ్చార్జ్ కాగా, మరో 2162 మంది చికిత్స పొందుతున్నారు.
చికిత్స పొందుతూ సోమవారం మరో నలుగురు మృతి చెందగా, మొత్తం కొవిడ్ మరణాలు 462కు చేరాయి.