మరో 173 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-06-24T05:01:28+05:30 IST

జిల్లాలో బుధవారం మరో 173 కరోనా కేసులు నమోదయ్యాయి.

మరో 173 కరోనా కేసులు

విశాఖపట్నం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం మరో 173 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,47,951కు చేరింది. ఇందులో 1,43,613 మంది కోలుకోగా, మరో 3,323 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, మరో ఇద్దరు మృతిచెందడంతో కొవిడ్‌ మరణాలు 1,015కు చేరాయి. 


ఐదు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు


జిల్లాలో బుధవారం మరో ఐదుగురు బ్లాక్‌ ఫంగస్‌ బారినపడినట్టు నిర్ధారణ అయ్యింది. వీరితో మొత్తం కేసుల సంఖ్య 274కు చేరింది. ఇందులో చికిత్స పొందుతూ ఇప్పటివరకు 22 మంది మృతిచెందారు.

Updated Date - 2021-06-24T05:01:28+05:30 IST