4 గంటల్లో 20 కరోనా కేసులు.. మొత్తం 216మందికి పాజిటివ్

ABN , First Publish Date - 2020-05-24T03:23:44+05:30 IST

కర్ణాటకలో కేవలం నాలుగు గంటల్లో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి ఈ రోజు సాయంత్రం...

4 గంటల్లో 20 కరోనా కేసులు.. మొత్తం 216మందికి పాజిటివ్

బెంగళూరు: కర్ణాటకలో కేవలం నాలుగు గంటల్లో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5గంటల వరకు 196 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే 5 గంటల నుంచి పది గంటల వరకు మరో 20 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 1959కి పెరిగిందని, 42 మంది మరణించారని తెలిపింది. ఇప్పటివరకు 608 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 1,307 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వివరించింది.

Updated Date - 2020-05-24T03:23:44+05:30 IST