మరో 5 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-28T10:31:09+05:30 IST

జిల్లాలో మంగళ, బుధవారాల్లో మరో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. వి.కోట, చిత్తూరు, శ్రీకాళహస్తి, సదుం

మరో 5 కరోనా కేసులు

  • 261కి పెరిగిన పాజిటివ్‌ల సంఖ్య

తిరుపతి, మే 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళ, బుధవారాల్లో మరో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. వి.కోట, చిత్తూరు, శ్రీకాళహస్తి, సదుం, పుంగనూరుల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులను జిల్లా యంత్రాంగం నిర్ధారించింది. వీటిలో వి.కోటకు సంబంధించిన కేసు మంగళవారం రాత్రి వెలుగు చూడగా మిగిలినవి బుధవారం బయట పడ్డాయి. సదుం మండలం పాలమంద పంచాయతీకి చెందిన యువకుడు హైదరాబాదు నుంచీ వచ్చినట్టు గుర్తించగా పుంగనూరు మండలం ముడిపాపనపల్లెకు చెందిన నడి వయసు వ్యక్తి చెన్నై నుంచీ వచ్చినట్టు, శ్రీకాళహస్తికి చెందిన నడి వయసు మహిళ కంటైన్మెంట్‌ క్లస్టర్‌ పరిధిలోని భాస్కరపేటలో నివాసముంటున్నట్టు గుర్తించారు.చిత్తూరు నగరం వైఎస్సార్‌ కాలనీకి చెందిన యువతి హైదరాబాదులో నర్సుగా పనిచేస్తూ రెండ్రోజుల క్రితం చిత్తూరు చేరుకున్నట్లు తేలింది.తాజా కేసులతో జిల్లాలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులు 261కి చేరుకున్నాయి.వీరిలో ఒకరు మృతి చెందగా 149 మంది కోవిడ్‌ బారి నుంచీ కోలుకుని ఆస్పత్రుల నుంచీ డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 111 మంది చిత్తూరు, తిరుపతిల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు

Updated Date - 2020-05-28T10:31:09+05:30 IST