మరో కార్గో బుకింగ్‌ కేంద్రం

ABN , First Publish Date - 2020-08-12T09:46:43+05:30 IST

నగరంలోని రాజవీహార్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ మరో పార్శిల్‌ బుకింగ్‌ సర్వీస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 4 నుంచి సేవలు ప్రారంభించామని

మరో కార్గో బుకింగ్‌ కేంద్రం

కర్నూలు(రూరల్‌), ఆగస్టు 11: నగరంలోని రాజవీహార్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ మరో పార్శిల్‌ బుకింగ్‌ సర్వీస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 4 నుంచి సేవలు ప్రారంభించామని  కర్నూలు-2 డిపో మేనేజర్‌ భాస్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.


  ఈ పాయింట్‌ నుంచి బుక్‌ చేసుకున్న సరుకులను ఏపీతో పాటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు చేరవేస్తామని ఆయన పేర్కొన్నారు. తక్కువ రుసుముతో సేవలు అందిస్తున్నామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధిక రుసుములు తీసుకుంటే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. 

Updated Date - 2020-08-12T09:46:43+05:30 IST