బంజారాహిల్స్ పీఎస్లో మరో నలుగురికి కరోనా
ABN , First Publish Date - 2021-04-03T15:35:29+05:30 IST
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మూడు రోజుల్లో మొత్తం 9 మందికి కరోనా సోకింది. క్రైం విభాగంలో పని చేసే ఐదుగురు ఒకేసారి వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు వైరస్ వచ్చింది. మొదటి దశ కరోనా సమయంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో 50 మంది వైరస్ బారిన పడ్డారు. రెండో దశ వేగంగా విస్తరి స్తుండటంతో మిగతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.