కొవిడ్ ఆసుపత్రిలో మరొకరి మృతి
ABN , First Publish Date - 2020-06-01T09:25:26+05:30 IST
విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి కరోనా కారణంగా మరణించాడు.
(విజయవాడ, ఆంధ్రజ్యోతి)
విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి కరోనా కారణంగా మరణించాడు. మృతదేహానికి ఆసుపత్రి సిబ్బంది ఆదివారం స్వర్గపురిలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ మరణాన్ని ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న కృష్ణలంకకు చెందిన మరో ఇద్దరు శనివారం మృతి చెందారు. అయితే ఆదివారం ఉదయం ప్రభుత్వ హెల్త్ బులెటిన్లో జిల్లాలో ఒకరు మాత్రమే మరణించినట్లు ధ్రువీకరించారు. దీంతో జిల్లాలో అధికారికంగా కరోనా మరణాల సంఖ్య 18కి చేరుకుంది. ప్రతిరోజూ నమోదవుతున్న పాజిటివ్ కేసుల వివరాలను ప్రభుత్వం జిల్లాలవారీగా వెల్లడించ లేదు.