మరో వ్యక్తికి కరోనా నెగెటివ్
ABN , First Publish Date - 2020-03-30T10:32:57+05:30 IST
ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాఽధుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో వ్యక్తికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాఽధుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో వ్యక్తికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారి సంఖ్య 116కు చేరింది. మరో 34 అనుమానిత కేసులకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారంతా కరోనా వార్డులో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం మెరుగ్గా ఉందని తెలిపారు.
క్వారంటైన్లో 166 మంది
జిల్లాలో కరోనా అనుమానితులుగా భావించిన 166 మందిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచామని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. వీరిలో భీమిలి కేంద్రంలో 60 మంది, గాజువాకలో 73 మంది, ఎలమంచిలిలో 18 మంది, నర్సీపట్నంలో 15 మంది ఉన్నారని ఆయన వెల్లడించారు.