నేటి నుంచి అంతర్వేది దర్శనాలు

ABN , First Publish Date - 2020-09-21T07:59:30+05:30 IST

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాలను సోమవారం నుంచి పునరుద్ధరించనున్నారు

నేటి నుంచి అంతర్వేది దర్శనాలు

అంతర్వేది, సెప్టెంబరు 20: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాలను సోమవారం నుంచి పునరుద్ధరించనున్నారు. ఆలయ ప్రాంగణంలో, దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో అధికారులు పునఃసమీక్షించి దర్శనాలు తిరిగి ప్రారంభించామని నిర్ణయించారు. ఆలయ సహాయ కమిషనర్‌ భద్రాజీ మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో రావాలన్నారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు, వృద్ధులకు ఆలయంలో ప్రవేశం లేదని తెలిపారు. 

Updated Date - 2020-09-21T07:59:30+05:30 IST