అంతర్వేది లక్ష్మీనరసింహుని అన్నదాన ట్రస్టుకు రూ.2లక్షల విరాళాలు
ABN , First Publish Date - 2021-10-17T08:03:00+05:30 IST
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యాన్న పథకానికి నెల్లూరు వాస్తవ్యులు పచ్చిపులుసు ఆనంద్కుమార్, భారతి దంపతులు రూ.1,00,116 విరాళంగా అందించారు.
అంతర్వేది, అక్టోబరు 16: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యాన్న పథకానికి నెల్లూరు వాస్తవ్యులు పచ్చిపులుసు ఆనంద్కుమార్, భారతి దంపతులు రూ.1,00,116 విరాళంగా అందించారు. మలికిపురానికి సత్యవాడ వెంకటరామకృష్ణ, కుమారి దంపతుల కుమారులు డాక్టర్ ఎస్వీ రాంబాబు, ఎస్ఎల్టీవీఎస్ నాయుడు రూ.1,00,116 విరాళాన్ని అందించారు.