పంద్రాగస్టుకి ఎర్రకోటపై యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు!

ABN , First Publish Date - 2021-08-01T11:38:13+05:30 IST

ఢిల్లీ నూతన పోలీసు కమిషనర్ రాకేష్ ఆస్థానా...

పంద్రాగస్టుకి ఎర్రకోటపై యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు!

న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన పోలీసు కమిషనర్ రాకేష్ ఆస్థానా ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. 50 మంది ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కొనసాగింది. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ ఎర్రకోటపై జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై అధికారులంతా దృష్టి సారించాలని కోరారు. 


ఈ పంద్రాగస్టుకి ఎర్రకోట వద్ద యాంటీ డ్రోన్ రాడార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని సాయంతో ఎర్రకోటకు నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి డ్రోన్‌ తిరిగినా కనిపెట్టవచ్చని, అలాగే దానిని నియంత్రించవచ్చన్నారు. కమిషనర్ ఇతర అధికారులకు పలు ఆదేశాలు జారీ చేస్తూ, ఆగస్టు 15న ఢిల్లీ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సాధారణ పౌరులను కూడా తనిఖీ చేయాలని, అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా అదుపులోకి తీసుకోవాలని కోరారు. 


Updated Date - 2021-08-01T11:38:13+05:30 IST