‘కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి’

ABN , First Publish Date - 2020-08-10T10:16:44+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సంకె రవిలు

‘కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి’

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 9: కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సంకె రవిలు అన్నారు. ఆదివారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ, క్విట్‌ ఇండియా స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ కార్మి క వ్యతిరేక విధానాలను మానుకోవాలని, పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రం కాలరాస్తోందని విమర్శించారు. దేశంలో రైల్వే, కోల్‌, ఇస్రో, రక్షణ రంగ పరిశ్రమలు, ఇన్సూరెన్స్‌ తదితర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్లకు దోచి పెడుతోందని, ఈ విధానాన్ని కేంద్రం రద్దు చేసుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. నాయకులు చంద్రమౌ ళి, గోవర్ధన్‌, సాం బారు వెంకటస్వామి, సీఐటీయూ ఎస్‌సీఈయూ మందమర్రి బ్రాంచ్‌ అధ్యక్షుడు మెడవెల్లి శంకర్‌, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-10T10:16:44+05:30 IST