బ్లీచింగ్‌కు బదులు మైదా కలుపుతున్నారనే వార్తలపై స్పందించిన అనురాధ

ABN , First Publish Date - 2020-06-05T17:47:39+05:30 IST

గుంటూరు: బ్లీnచింగ్‌కు బదులు మైదా కలుపుతున్నారంటూ వస్తున్న వార్తలపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనురాధ స్పందించారు.

బ్లీచింగ్‌కు బదులు మైదా కలుపుతున్నారనే వార్తలపై స్పందించిన అనురాధ

గుంటూరు: బ్లీచింగ్‌కు బదులు మైదా కలుపుతున్నారంటూ వస్తున్న వార్తలపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనురాధ స్పందించారు. బ్లీచింగ్ బదులు మైదా కలుపుతున్నారని ఫేక్ న్యూస్ వైరల్ అవుతోందన్నారు. మైదా సంచుల్లో సున్నం ప్యాక్ చేశామని. లాక్ డౌన్‌లో సంచుల కొరత కారణంగా మైదా సంచుల్లో సున్నం ప్యాక్ చేశారని వెల్లడించారు. మైదా సంచుల్లో ఉన్న సున్నాన్ని టెస్ట్ చేయించామని.. నిబంధనల మేరకే సున్నం ఉందన్నారు. ఎక్కడ ఎటువంటి తేడా లేదని.. మైదా గాని, బియ్యపు పిండిగాని కలప లేదని అనురాధ స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-05T17:47:39+05:30 IST