వామిక ఫొటోలు షేర్ చేయొద్దు ప్లీజ్.. మరోమారు విజ్ఞప్తి చేసిన కోహ్లీ దంపతులు

ABN , First Publish Date - 2022-01-25T01:08:25+05:30 IST

తమ కుమార్తె వామిక ఫొటోలను ప్రచురించవద్దంటూ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు

వామిక ఫొటోలు షేర్ చేయొద్దు ప్లీజ్.. మరోమారు విజ్ఞప్తి చేసిన కోహ్లీ దంపతులు

కేప్‌టౌన్: తమ కుమార్తె వామిక ఫొటోలను ప్రచురించవద్దంటూ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు మరోమారు అభ్యర్థించారు. దక్షిణాప్రికాతో నిన్న ఇక్కడ జరిగిన చివరి వన్డేలో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత అభిమానులను చూస్తూ కోహ్లీ అభివాదం చేశాడు. అదే సమయంలో కుమార్తెతో డ్రెస్సింగ్ రూములో ఉన్న అనుష్క కుమార్తెకు తండ్రిని చూపిస్తూ చప్పట్లు కొట్టింది. దీంతో కెమెరాలన్నీ ఒక్కసారి వారివైపు తిరగడంతో వామిక కూడా కెమెరాలకు చిక్కింది. ఆ వెంటనే ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.


కుమార్తె విషయంలో గోప్యత పాటిస్తూ ఏడాది కాలంగా జాగ్రత్తగా ఉంటున్న కోహ్లీ దంపతులు కుమార్తె ఫొటోలు సోషల్ మీడియాకెక్కడంతో షాకయ్యారు. పాప ఫొటోలు బయటకు వచ్చి వైరల్ కావడంపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. స్టేడియంలో తీసిన వామిక ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అయ్యాయని తెలిసిందని, ఇలా జరుగుతుందని ఊహించలేకపోయామని అన్నారు. వామిక విషయంలో గోప్యత పాటించాలనే తొలి నుంచి కోరుకుంటున్నామని, తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పుకొచ్చారు. చిన్నారి ఫొటోలు ప్రచురించని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-01-25T01:08:25+05:30 IST