ప్రజల ప్రాణాలు కాపాడండి: శైలజానాథ్
ABN , First Publish Date - 2020-08-13T07:33:37+05:30 IST
ప్రజల ప్రాణాలు కాపాడండి: శైలజానాథ్
అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కరోనా సంక్షోభం నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వండి. కరోనా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. పేద, మధ్య తరగతి ప్రజలు, బడుగు బలహీన వర్గాలు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నాయి’’ అని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. ఆయన బుధవారం ఈ మేరకు ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు.