నేడు కూడా సచివాలయ ఉద్యోగాల పరీక్షలు
ABN , First Publish Date - 2020-09-21T10:03:56+05:30 IST
నేడు కూడా సచివాలయ ఉద్యోగాల పరీక్షలు
విశాఖపట్నం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి/ సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు సోమవారం పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 54 కేంద్రాల్లో గ్రామ రెవెన్యూ అధికారి/ సర్వేయర్ పోస్టుకు, మధ్యాహ్నం 35 కేంద్రాల్లో డిజిటల్ అసిస్టెంట్ పోస్టుకు పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు పూటలా పరీక్షలకు 30,243 మంది హాజరుకానున్నారు. ఈ పరీక్షలు నగరంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో జరుగుతాయని జిల్లా పరిషత్ సీఈవో వి.నాగార్జునసాగర్ తెలిపారు.