ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2020-09-21T10:32:51+05:30 IST

ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు

ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు

వజ్రపుకొత్తూరు:వజ్రపుకొత్తూరు బస్టాండ్‌ వద్ద ఆదివారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు...నువ్వలరేవుకు చెందిన మువ్వల లారెన్స్‌, మువ్వల తుంబేష్‌ ద్విచక్కవాహనంపై గల్లీ వైపు వస్తున్నారు.  ఎదురుగా దున్నవానిపేటకు చెందిన కేతు జోగారావుతోపాటు మరో వ్యక్తి గల్లి నుంచి వజ్రపుకొత్తూరు వైపు ద్విచక్రవాహనంపై వస్తున్నారు.రెండు వాహనాలు ఢీ కొనడంతో మువ్వల లారెన్స్‌, మువ్వలతుంబేష్‌,కేతు జోగారావుకు గాయాలయ్యాయి.   ముగ్గుర్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-21T10:32:51+05:30 IST