పెంచిన పెట్రో ధరలను తగ్గించాలి

ABN , First Publish Date - 2020-09-21T11:40:22+05:30 IST

పెంచిన పెట్రో ధరలను తగ్గించాలి

పెంచిన పెట్రో ధరలను తగ్గించాలి

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 20 : కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజానీకం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే  రాష్ట్ర ప్రభుత్వం పెట్రో, డీజి ల్‌ ధరలు పెంచి మరింత భారంమోపిందని జి ల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మూడు పర్యాయా లు పెట్రో, డీజిల్‌పై ధరలు పెంచిందని విమ ర్శించారు. ఇందుకు నిరసనగా ఆదివారం ఒం గోలులోని డీసీసీ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా లో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పేరుతో పన్ను లు పెంచి భారాలు మోపడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికే ఉచిత విద్యుత్‌పై భారం వేయగా, పెట్రో, డీజల్‌ ధరలు పెంచారని విమర్శించారు. ఇసుకపై టన్నుకు రూ.100 పెంచి సామాన్యుల ను ఇబ్బందిపెడుతున్నారని, ఈ విఽధానాలను ఉ పసంహరించుకోకుంటే ఉద్యమాన్ని మరంత ఉ ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కా ర్యక్రమంలో ఎస్‌కే.రసూల్‌, జాకబ్‌, శ్రీహరి, ఆది తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-21T11:40:22+05:30 IST