ముక్కంటి ఆలయంలో పెరుగుతున్న భక్తుల సంఖ్య
ABN , First Publish Date - 2020-09-21T11:54:00+05:30 IST
ముక్కంటి ఆలయంలో పెరుగుతున్న భక్తుల సంఖ్య
శ్రీకాళహస్తి, సెప్టెంబరు 20: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో ఆలయంలో భక్తులను దర్శనాలను అనుమతించిన తరువాత రోజుకు సగటున 1,500లోపే భక్తులు వచ్చేవారు. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు కూడా 500లోపే జరిగేవి. అయితే కొన్ని రోజులుగా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం 4,434 మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక 1,111 మంది రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేసుకున్నారు. ఇక ప్రసాదాలు కూడా 10,298 విక్రయించారు. లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఈ-పాస్ అవసరం లేక పోవడంతో భక్తుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.