కనకమ్మకు లక్ష చేమంతుల పూజ
ABN , First Publish Date - 2020-10-19T10:40:33+05:30 IST
కనకమ్మకు లక్ష చేమంతుల పూజ
- ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారు
శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బురుజుపేటలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ఆదివారం లక్ష చేమంతులతో వైభవోపేతంగా పూజ నిర్వహించారు. రెండోరోజు అమ్మవారిని ధనలక్ష్మిగా అలంకరించారు. పూజ అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ మండపంలో హోమం కూడా నిర్వహించారు. కాగా, అమ్మవారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
-వన్టౌన్